కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ | Mudra News

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ | Mudra News

ముద్ర ప్రతినిధి, హైదరాబాద్​: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు  సోమవారం విచారణ చేపట్టింది. అయితే మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టామని కోర్టు కు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా కోర్టు కు తెలపకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. డివిజన్ బెంచ్ లో పార్టీ ఇన్ పర్సన్ గా  కెఎ.పాల్​వాదనలు వినిపించారు. తదుపరి విచారణను  ఏప్రిల్ 17 కు హైకోర్టు వాయిదా వేసింది.