రోహితన్న కార్మిక చేయూత
- ద్వారా డ్రైవర్లకు భీమా పత్రాలు పంపిణీ
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:-రోహితన్న కార్మిక చేయూత కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత భీమా పత్రాలు ఆదివారం అందించారు.నియోకవర్గ పరిధిలోని ప్రైవేట్ వాహనాలు నడిపే డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి తన చేతులమీదుగా భీమా పత్రాలు పంపిణీ చేశారు. డ్రైవర్లకు రూ.10 లక్షల ఉచిత భీమా పత్రాలను అందజేయడం జరిగింది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రైవేట్ వాహనాలు నడిపే డ్రైవర్లకు తక్షణం మెరుగైన వైద్యం అందించేందుకు, అలాగే ప్రమాదాలలో ఆకస్మికంగా అంగవైకల్యం పొందితే వారి కుటుంబాలకు ఈ ఉచిత భీమా వల్ల ఆర్టికంగా చేయూత లభిస్తుందని విఠల్ రెడ్డి అన్నారు.