అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

ముద్ర,తెలంగాణ:- మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్‌ఓటి టెమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్‌ లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని అమెజాన్ కొరియర్‌లో అక్రమంగా తరలిస్తున్నారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు. అయితే ఈ గంజాయి ఒరిస్సా నుంచి హైదరాబాద్‌ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌ను వేనుక సూత్రధారులెవరూ, ఎలా చేస్తున్నారు.. దానిపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు.