మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారంలో అగ్నిప్రమాదం

మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారంలో అగ్నిప్రమాదం

ముద్ర,తెలంగాణ:- మేడ్చల్ జిల్లా అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మచ్చబొల్లారంలోని వీబీసిటీ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.