బి ఎన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయాలి

బి ఎన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయాలి

 ముద్ర.తిరుమలగిరి.సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు,  భూమికోసం ,భుక్తి కోసం, వేట్టి చాకిరీ విముక్తి కోసం, పోరాడినటువంటి  భీమ్ రెడ్డి నరసింహారెడ్డి 15 వర్ధంతి కార్యక్రమాన్ని మంగళ వారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా లో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు,  ప్రగతి నగర్ వద్దనున్న ఎస్ ఆర్ ఎస్ పి కాలువ దగ్గర భీమ్ రెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బియన్ రెడ్డి కూతురు  రాజేశ్వరి దేవి హజ రైనారు. ఈ సందర్భంగా తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ బి.యన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా  ఎంపీగా అనేక పర్యాయాలు ప్రజా ప్రతినిధిగా ఉండి తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కరించడంలో ముందుండే వారని అన్నారు.  తుంగతుర్తి నియోజకవర్గం లో అన్ని గ్రామాలకు ‌సాగు, త్రాగు నీరు అందించే  దిశగా ప్రభుత్వం తో కొట్లాడి ఎస్సారెస్పీ కాల్వకు రావడానికి ముఖ్య కారణం బి.ఎన్.రెడ్డి అని గుర్తుచేశారు ఎస్సారెస్పీ కాల్వకు బి.యన్.రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, బి.ఎన్ అభిమానులు  తాటికొండ సీతయ్య,  ఎల్లంల యాదగిరి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు,   దాచేపల్లి వెంకన్న, పత్తేపురం యాదగిరి, కొండల్ పోరేళ్ళ లక్ష్మయ్య, మల్లయ్య, సోమిరెడ్డి, మెల్కాపూరి శ్రీకాంత్ గౌడ్, కొత్తగట్టు యాదగిరి, కొత్తగట్టు బుచ్చిబాబు పోరెల్ల వెంకన్న ఆకారపు సైదులు, కడెం మల్లయ్య, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.