ఆత్మీయ సేవా సమితి అధ్వర్యంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ ...

ఆత్మీయ సేవా సమితి అధ్వర్యంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ ...

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్:ఆత్మీయ సేవా సమితి అధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి తో పాటు తాండూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణా శ్రీనివాస్ చారి ఆదివారం పేదలకు దసరా పండుగ రేషన్ కిట్స్-పంపిణీ చేశారు. తాండూరు ఆత్మీయ సేవా సమితి సభ్యుల సేవాగుణం గొప్పదని, మిత్రులు అందరూ సేవా గుణంతో దసరా పండుగ కు పేదలను పేదలను ఆదుకోవడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి ఈ సందర్భంగా ఆత్మీయ సేవా సమితి సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బీఅర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, బంట్వారం సుధాకర్, రొంపల్లు సంతోష్, మల్ రెడ్డి, అషద్, ముకేష్, ప్రసాద్ తదతరులు ఉన్నారు.