కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక
- ఆహ్వానించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కమలానగర్ కు చెందిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
అలాగే మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మద్గుల్ చిటంపల్లికి చెందిన 30 మంది బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రమేష్ ,మల్లయ్యల ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు ప్రసాద్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.