జెపిఎస్ ల వంటావార్పు..!

జెపిఎస్ ల వంటావార్పు..!

కేసముద్రం, ముద్ర: ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం సమ్మె చేస్తున్న జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో భాగంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేరేంతవరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా కూరగాయలతో జేపిఎస్ ఆకారాన్ని అలంకరించి వినూత్నత చాటారు.