అవినీతి అంతం - బీజేపీ పంతం
- కామారెడ్డి ప్రజలకు కూడా అవినీతి అంతమే కావాలి
- బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వేంకట రమణ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అవినీతి అంతం - బీజేపీ పంతం అని, ఇప్పుడు కామారెడ్డి ప్రజలకు కూడా అవినీతి అంతమే కావాలనీ బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బీబీపెట్ మండల కేంద్రానికి చెందిన 63 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వేంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా వేసుకొని బీజేపీ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో ముఖ్యమంత్రి ఓటమి భయంతో 100 ఓట్లకు ఒక ఇంఛార్జి నీ పెట్టీ ఓటర్లను మభ్య పెడదాం అని చూస్తున్నారని, కానీ 100 ఓట్లకు ఒక్క ఇంఛార్జి కాదు 1 ఓటు కి ఒక ఇంఛార్జి నీ పెట్టినా కామారెడ్డి లో గెలిచేది బీజేపీ నే అని ధీమా వ్యక్తం చేశారు. BRS నాయకులు కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ పథకాలు గా చెప్తున్నారనీ కానీ క్షేత్ర స్థాయిలో అందే ప్రతి సంక్షేమ పతకం వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయనీ అన్నారు. ఒక్క సారి బీజేపీ కి ఓటు వేస్తే అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతుందని అన్నారు.