ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు

ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్ లో జరిగింది.  జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం నాడు కంబాపూర్ లో దెబ్బ తిన్న పంటలను పరిశీలించడానికి గ్రామంలో ప్రవేశించగానే గ్రామస్తులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కేవలం పరామర్శలు తప్పా ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని, స్పష్టమైన హామీ సైతం ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహించారు. వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి నివేదిక తయారు చేస్తామని, త్వరలోనే నష్టపరిహారం అందే విధంగా చూస్తామని, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.