మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, ముద్ర: నియోజకవర్గంలోని చందూర్ మండలంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మొక్క జొన్న ను దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధరకు విక్రయించుకోవలన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో చందూర్ PACS సబ్ సెంటర్ కు భూమిపూజ చేసి CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.