టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి,కామారెడ్డి : జిల్లా ఎస్పీ బి . శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మరికొన్ని పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరిశీలించి తగు జాగ్రత్త చర్యలను సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంగటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల పరీక్షల పర్యవేక్షణ అధికారులకు, పోలీసు అధికారులకు సూచించారు. అనవసర చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు