రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం
  • రేవంత్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు చేసిన షబ్బీర్ అలీ        

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నరేవంత్ రెడ్డి తరఫున  మాజీ మంత్రి మహమ్మద్ అలి షబ్బీర్ బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో  మాట్లాడుతూ కొడంగల్ లో రేవంత్ రెడ్డికి వచ్చే మెజారిటీ  కన్నా ఎక్కువ మెజార్టీ కామారెడ్డిలో రావాలని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి చేయని బిఆర్ఎస్ పార్టీ… ఇక్కడ మళ్లీ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలను అందించేందుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు అని చెప్పారు. రేవంత్ రెడ్డి తరఫునఈరోజు నామినేషన్ వేశానని కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవబోతోందని, రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీఅరికెల నర్సారెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్లరాజు అసెంబ్లీ యూత్ అద్యక్షులు ఐరేని సందీప్, పట్టణ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మక్సుధ్. గడ్డం చంద్రశేఖర్, శ్రీనివాస్ యాదవ్, అన్వర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు