అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి  మద్యం, నగదు మరియు ఇతర నిషేధిత పదార్థాలు, వస్తువులు కామారెడ్డి జిల్లాలోనికి రాకుండా చూసేందుకు మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాబత్పూర్ వద్ద, జుక్కల్ 
పోలీస్ స్టేషన్ పరిధిలోని సోపూర్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటుచేసి 24/7  అన్ని వాహనాలను పూర్తిగా, క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.  ఈరోజు రెండు చెక్పోస్టులను తనిఖీ చేసి అక్కడున్న అధికారులకు తగు సూచనలు సలహాలు చేయడం జరిగినది.