మురికి కాలువలో నవజాత శిశువులు -కామారెడ్డి జిల్లా కేంద్రంలో హృదయ విధారక ఘటన
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కవల పిల్లలు జన్మించిన వెంటనే వారిని మురికి కాలువలో పడేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణంలో ని బతుకమ్మ కుంటలో ఓ వస్త్రంలో ఆడ, మగ శిశువులను కట్టి పడేయగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిఐ నరేష్ తన సిబ్బంది తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని శిశువును బయటకు తీశారు. అప్పటికే వారు విగత జీవులుగా ఉన్నారు. స్థానికంగా ఆసుపత్రుల్లో జరిగిన డెలివరీలు, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణుల వివరాలను సేకరించి, కవల పిల్లల తల్లిని గుర్తించేందుకు పోలీసులు రంగంలో దిగారు. కాగా ఈ ఘటన కాలనీ వాసులను కలచి వేసింది