నష్టపరిహారం కోసం కలెక్టరేట్ ముట్టడి -భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు    

నష్టపరిహారం కోసం కలెక్టరేట్ ముట్టడి -భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు పార్టీలకు అతీతంగా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల గుండా సాగిన ఈ ర్యాలీ కలెక్టరేట్ కు చేరుకొంది. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించారు. వెంటనే సర్వే పూర్తి చేసి, ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, పాక్షికంగా దెబ్బతిన్న పంటలకు రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లు, బైకులపై తరలివచ్చారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.