చెరువు కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ

చెరువు కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం మంతని దేవునిపల్లి, ఇస్సాయపల్లి గ్రామస్తుల మధ్య శుక్రవారం నాడు చెరువు విషయమై ఘర్షణ జరిగింది.  ముదిరాజ్, బెస్త కులస్తులు చెరువు తమది అంటే తమది అంటూ గొడవ పడ్డారు. చెరువులో చేపలు పట్టడం లో తగాదా నెలకొనడంతో ఓ దశలో లాఠీలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో మాచారెడ్డి మండల పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపులోకి తీసున్నారు.