ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

 ముద్ర ప్రతినిధి కామారెడ్డి: కామారెడ్డి మండలం గర్గుల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఎండబెట్టి శుభ్రపరచిన ధాన్యమును కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.