చంద్రాయన్ పల్లిలో రెండు చిరుత పులుల సంచారం

చంద్రాయన్ పల్లిలో రెండు చిరుత పులుల సంచారం

కొండపై సంచరిస్తున్న చిరుత పులులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రెండు చిరుత పులులు ప్రత్యక్షమయ్యాయి. కొండ పైన ఆడ, మగ పులులు సంచరిస్తుండగా గ్రామస్తుడైన రాజయ్య చూశాడు. దీంతో భయాందోళనకు గురై గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు కర్రలతో  కొండ ప్రాంతానికి వెళ్లారు. అలాగే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే చిరుతపులులు అడవి లోకి వెళ్లిపోయాయి.