కెసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం 

కెసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం 
  • ఎమ్మెల్సీ ఎల్వి రమణ                                                                  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి నుండి పోటీ చేస్తున్న కేసీఆర్ని బలపరిచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత పద్మశాలీలపై ఉందనీ ఎమ్మెల్సీ ఎల్వి రమణ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.  పద్మశాలీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా పద్మశాలి కులస్తులను పట్టించుకోలేదని కెసిఆర్ తనను పిలిచి ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉండాలని తనను పిలిపించారన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల పద్మశాలీలతో ఆత్మీయ సమ్మేళనం పార్సిరాములు కళ్యాణ మండపంలో జరిగింది.  ఎంత  మెజార్టీతో గెలిపిస్తే అంత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇతర పార్టీల మాటల్లో పడి మోసపోవద్దని సూచించారు. తనకు న్యాయం చేసే వారిని ఎన్నుకోవాలని కోరారు. వెనుకబడిన వర్గాల వారికి సన్న బియ్యం ఆరోగ్య భీమా ఆరోగ్య రక్షణ కల్పించి అన్ని రకాల సహాయ సహకారాలను అందించినట్లు తెలిపారు. ఆండ్లూమ్స్ పవర్ చైర్మన్ గూడూరు ప్రకాష్ రాష్ట్ర నాయకులు సుధాకర్ లక్ష్మీనారాయణ చట్ల రాజేశ్వర్, ఐరన్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.