కామారెడ్డి జిల్లాలో 11 శాతం పోలింగ్ - బారులు తీరుతున్న ఓటర్లు..

కామారెడ్డి జిల్లాలో 11 శాతం పోలింగ్ - బారులు తీరుతున్న ఓటర్లు..

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలోని పట్టణాలు,మారుమూల ప్రాంత పల్లెలో ఉదయాన్నే ఓటర్లు బారులు తీరారు. పల్లెల్లో వ్యవసాయ పనుల దినం కావడంతో ఆయా గ్రామాల్లోని కూలీలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాలల్లో ర్యామ్పులు లేకపోవడంతో వికలాంగులకు ఇబ్బందులు అవుతున్నాయి.

11 శాతం పోలింగ్ 

జిల్లాలో ఉదయం 9.00 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది. 
నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం :

013-జుక్కల్ (SC) : 7.43 శాతం

015-యెల్లారెడ్డి : 11.02 శాతం

016-కామారెడ్డి : 11.09 శాతం

014-బాన్సువాడ: 13.36 శాతం