తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంలో స్పీకర్

తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంలో స్పీకర్

బాన్సువాడ, ముద్ర:  దేశ రాజధాని ఢిల్లీ లోని వసంత విహార్ లో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి (BRS ) పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.  తెలంగాణ భవన్ ను  BRS పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని సిఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.