ప్రశాంతంగా ప్రారంభమైన నవోదయ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ప్రారంభమైన నవోదయ ప్రవేశ పరీక్ష

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: నవోదయ విద్యాలయంలో 6వ తరగతి లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష శనివారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది.  నిజాంసాగర్ లోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా, 5192 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 2576 మందికి 14 పరీక్ష కేంద్రాలు, నిజామాబాద్ జిల్లాలో2616 మందికి 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం11.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం10 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనడంతో చీఫ్ సూపరింటెండెంట్లు పరిస్థితులను చక్కదిద్దారు. 11.30 తర్వాత విద్యార్థులు రాకుండా కఠిన నిర్ణయం తీసుకోవడంతో ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. కాగా ఉదయం వేళ వర్షం కురవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు అయ్యాయి.