కామారెడ్డిలో రూ.56.84 లక్షలు పట్టివేత

కామారెడ్డిలో రూ.56.84 లక్షలు పట్టివేత

 ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ స్కూల్ ఎదురుగా ఉన్న టైర్ షాప్ వద్ద మంగళవారం నాడు డబ్బులు పంచుతున్నారని సమాచారం మేరకు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఆ షాపు బయట ఓ పార్టీ నేటితో పాటు అనుచరుల వద్ద ఒక బ్యాగ్ కనబడగా FST సభ్యులు ఆ బ్యాగును చెక్ చేయగా, ఆ బ్యాగులో 500 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. వెంటనే FST సభ్యులు, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లకు తెలియజేయగా, ఇన్కమ్ టాక్స్ అధికారి అభిషేక్ శుక్లా అక్కడికి వచ్చి పంచనామ నిర్వహించి, ఆ బ్యాగులో ఉన్న 500 రూపాయల నోట కట్టలు మొత్తం లెక్కించి చూడగా అవి 56 లక్షల 84 వేలు ఉన్నాయి. ఇట్టి వాటిని సీజ్ చేసి తగు చర్య నిమిత్తం బుధవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, గూడెం శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.