ఓటమి భయంతోనే మండలానికి ఒక సభ

ఓటమి భయంతోనే మండలానికి ఒక సభ
  • దొరల అహంకారాన్ని కామారెడ్డి ప్రజలు సహించరు
  • బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఓటమి భయంతోనే బిఆరెస్ వారు మండలానికి ఒక సభ నిర్వహిస్తున్నారని, యువరాజుకు పరాభవం తప్పదని బిజెపి కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి అన్నారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన 15 మంది బీజేపీ పార్టీలో రమణా రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని చేరారు.ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ యువరాజు వచ్చి గ్రామ గ్రామాన చెప్పులు లేకుండా తిరిగినా కామారెడ్డి ప్రజలు BRS కి ఓటు వెయ్యరు అని, ఓటమి భయంతోనే మండలానికి ఒక సభ పెడుతున్నారనీ, వారి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందనీ, అందుకే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. దొరల అహంకారాన్ని కామారెడ్డి ప్రజలు సహించరు అని తమ ఓటు ద్వారా తగిన బుద్ది చెప్తారని అన్నారు.