కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి.  బిఆరెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన  కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్, కామారెడ్డి పట్టణ BRS పార్టీ మాజీ అధ్యక్షులు గడ్డం చంద్రశేఖర్లు మంగళవారం నాడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో  షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఆ పార్టీ లో చేరారు. అలాగే కామారెడ్డి BRS సీనియర్ నాయకులు గడ్డం సూర్య, కామారెడ్డి పట్టణ 16 వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ, BRS పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బీసీ సెల్ కార్యదర్శి బల్ల శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు బండారి శ్రీకాంత్, యూత్ కమిటీ సభ్యులు ఇమ్రాన్, వేణు, చేవెళ్ల రాజు అందరు BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మాజీ మంత్రి  షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొనె శ్రీనివాస్ తతిదరులు పాల్గొన్నారు.