రైతులకు సబ్సిడీలో యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:రైతులకు సబ్సిడి పై యూరియా అందజేసేది కేంద్ర ప్రభుత్వమని, బిఆరెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని బిబిపెట మండలం జనగామ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు సబ్సిడీలో యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వం అని, రైతులకు ఉపయోగపడే ఫసల్ భీమా పధకం పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజన తెలంగాణలో అమలు చేయడం లేదనీ, రుణ మాఫీ పేరుతో రైతులను ముంచింది KCR ప్రభుత్వం అని అన్నారు. ఒక్క అవకాశం బీజేపీ కి ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.