గంగమ్మ గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజ

గంగమ్మ గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజ

బాన్సువాడ, ముద్ర: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  సోమవారం నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ గుడి పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్సువాడ సెగ్మెంట్ భక్తిలో ముందు స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గంలో మందిరాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, పెర్కా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.