ఎన్నికల నిర్వహణ కు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్

ఎన్నికల నిర్వహణ కు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి :పోలింగ్ నిర్వహణ, ఈ.వి.ఏం. ల పై  అవగాహన  పొందిన మాస్టర్ ట్రైనీలు నియోజక వర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తగు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్  హాల్ లో మాస్టర్ ట్రైనీలు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తూ ఓటింగ్ మెషిన్ లోవి వివిధ అంశాలపై ట్రైనర్లకు వివరించారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు నియోజక వర్గాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు    పోలింగ్ సజావుగా నిర్వహించేలా ఈ.వి.ఏం. విప్ ఫ్యాట్ ల నిర్వహణపై అవగాహన కలిగించడంతో పాటు అనుసరించవలసిన విధానాలు, పోలింగ్ అనంతరం చెక్ లిస్ట్ ప్రకారం  అందజేయవలసిన వివిధ పత్రాలపై పూర్తి స్థాయి,లో అవగాహన కలించాలన్నారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి రఘునందన్,తహసీల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.