కామారెడ్డి జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కామారెడ్డి జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకొంటున్నారు. ఉదయం వేళ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లాలో ని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో ఘనంగా అంబెడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.  బాన్సువాడ  పట్టణం లో అంబేడ్కర్ సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణం అంబేడ్కర్ చౌరస్తా లో ఉన్న వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.   భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను, నిమ్న వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలను తలచుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పురపాలక సంఘం ఛైర్మెన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జూబేర్, సీనియర్ నాయకులు ఏజాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.