బాన్సువాడ ఇఫ్తార్ విందులో ఎం ఐ ఎం ఎమ్మెల్సీ

బాన్సువాడ ఇఫ్తార్ విందులో ఎం ఐ ఎం ఎమ్మెల్సీ

బాన్సువాడ, ముద్ర: మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎం ఐ ఎం) ఆధ్వర్యంలో శనివారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ లో అన్ని మతాల వారు భాయ్ భాయ్ గా ఉంటూ పండుగలను జరుపుకొంటారన్నారు. ఎం ఐ ఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు సైద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ ఛైర్మన్ జుబేర్, ఎజాస్, సిఐ మహేందర్ రెడ్డి, అతిప్, నైమ్ హాసన్ తదితరులు పాల్గొన్నారు.