ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్

ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. గోదాం లో ఉన్న సీసీటీవీ ల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.