మంత్రుల పర్యటనలో "పిక్ ప్యాకెటింగ్"

మంత్రుల పర్యటనలో "పిక్ ప్యాకెటింగ్"
  • మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ వి రూ.21,400 చోరి
  •  ప్రముఖ వ్యక్తుల పర్యటన లో పదేపదే ఇదే తంతు

వెల్గటూర్, ముద్ర :  వెల్గటూర్ మండలంలోని  పైడిపెల్లి గ్రామంలో లో  సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు పర్యటించగా అక్కడ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యకర్తలు లాగా ప్రజలల్లో కలిసిపోయి "పిక్ ప్యాకెటింగ్" చేశారు. కాగా అందులో మండలంలోని కుమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్  కొప్పుల సాగర్ కు సంబంధించిన రూ.21,400 చోరీకి గురయ్యాయి.

అదేవిధంగా మరికొందరు కార్యకర్తలకు సంబంధించిన డబ్బులు కూడ చోరీకి గురైనట్లు సమాచారం. గతంలో ఆరోగ్యశాఖ  మంత్రి తన్నీర్ హరీష్ రావు వెల్గటూర్ మండలం లో పర్యటించినప్పుడు కూడా ఇలాగే చోరీ జరిగి లక్షకు పైగానే  నష్టపోవాల్సి వచ్చింది. చాలా మంది పోలీసుల పహారా ఉన్నప్పటికీ  కొందరు దొంగలు చాక చక్యంగా దొంగతనం చేయడం పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.