దీపావళి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న పైలెట్ రోహిత్ రెడ్డి  

దీపావళి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న పైలెట్ రోహిత్ రెడ్డి  

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: దీపావళి పండుగ సందర్భంగా వారి నివాసంలో బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తల్లితండ్రులు విఠల్ రెడ్డి, ప్రమొదిని సతీమణి ఆర్తి రెడ్డి, కుమార్తె నక్షత్ర, కుమారుడు జైదేవ్ రెడ్డి లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. ఆ దేవుని రానున్న ఎన్నికల్లో తను మరోసారి తాండూరు ఎమ్మెల్యే గా, మూడవ సారి బీఅర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకుంటున్న దీపావళి పండుగ వల్లే అభివృద్ధి కి కృషి చేసే వారికి తిరిగి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు అనంతరం బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు.