గులాబీ జెండా ఎగుర వేయాలి

గులాబీ జెండా ఎగుర వేయాలి
  • అభివృద్ధికి పట్టం కట్టాలి
  • పైలెట్ రోహిత్ రెడ్డి ని భారీ మెజారిటీతో  గెలిపిద్దాం
  • బీఆర్ఎస్ నాయకురాలు, జడ్పిటిసి ప్రమోదిని

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:అభివృద్ధికి పట్టం కట్టి పైలెట్ ను గెలిపించి గులాబీ జెండాను తాండూరు నియోజకవర్గంలో ఎగరవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి మాతృమూర్తి వికారాబాద్ జెడ్పిటిసి ప్రమోదిని  అన్నారు. ఆదివారం యాలాల మండల కేంద్రంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, యాలాల జడ్పిటిసి సంధ్యారాణి, మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, సీనియర్ మహిళా నాయకురాలు శకుంతల లతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేసిన తన బిడ్డ, మీ బిడ్డ పైలెట్ కు భారీ మెజార్టీ అందించాలన్నారు. 30, 40 సంవత్సరాలు నుండి కానీ అభివృద్ధి కేవలం రెండు సంవత్సరాలలో సాధించిన ఘనత మీ బిడ్డ పైలెట్ దేననిన్నారు. ప్రతి గ్రామానికి రూ. 50 లక్షల నిధులను అందించి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నమ్మకాన్ని చూరగొని రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తాండూరుకు తీసుకువచ్చిన ఘనత  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దే అన్నారు.