ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
- జిల్లాలో ఉదయం 11:00 గంటల వరకు 20.94 శాతం పోలింగ్
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని సంగేమ్ లక్ష్మి బాయి ఉన్నత పాఠశాలలోని 138 పోలింగ్ కేంద్రంములో గల తన ఓటు హక్కును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 11:00 గంటల వరకు 20.94 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తను కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. సంగేమ్ లక్ష్మి బాయి ఉన్నత పాఠశాలతో పాటు, స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు) లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సిబ్బంది నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, పి డబ్ల్యు డి, మరియు పోస్టల్ బ్యాలెట్ మోడల్ అధికారిని లలిత కుమారి, వికారాబాద్ ఏఆర్ఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.