బి ఆర్ ఎస్ కి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బి ఆర్ ఎస్ కి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరికలు

సిరిగిరిపెట్ గ్రామానికి చెందిన 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ సర్పంచ్ వెంకటప్ప  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూర్ నియోజక వర్గం తాండూర్ మండలం సిరిగిరిపెట్ గ్రామానికి చెందిన 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ సర్పంచ్ వెంకటప్ప  ఆధ్వర్యంలో సోమవారం తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరినీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి మనోహర్ రెడ్డి ఆహ్వానించారు.. అనంతరం మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలకుల ముఖం చూసి ప్రజలు విసిగిపోయారని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారంటే తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని అన్నారు. తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు.

కెసిఆర్ పాలనలో దగా, అవినీతి, కుటుంబ రాజకీయాలు చేస్తూ కుంభకోణాలు, నిరుద్యోగులను మోసం చేస్తుందని అన్నారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దత్తు గా నిలబడి, నియంతృత్వ నిరంకుశ పాలనకు గద్దె దించాలని అన్నారు. తాండూర్ కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బిఅర్ఎస్ పార్టీకి భయం పుట్టుకుందని, కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు.  అయిదేండ్లలో తాండూర్ లో ఏమి అభివృద్ది‌ చేశారో అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలన్నారు. ఇప్పటికే కారుకు ఆల్రెడీ టైర్లలో గాలి పోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6గ్యారెంటీ పథకాలు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి సిలిండర్ 400 ఇస్తామని చెప్పడం వారి బీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం అబద్ధమేనని ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వడ్డే శ్రీను,పలువురు వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.