మాఫియాలకు డ్రగ్స్ కు అడ్డగా మారిన తాండూరు

మాఫియాలకు డ్రగ్స్ కు అడ్డగా మారిన తాండూరు

తాండూర్ ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డిని గెలిపించాలి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డిని నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కోరారు. ఆయన తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులతోకెందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు పట్టణంలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు అడ్డవేశారని వీరంతా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు వీరిని వాడుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి రప్పించారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వీధి ఆగడాలను అడ్డుకుంటుందని హెచ్చరించారు.  నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని,  గతంలో మంజూరైన పనులను తాను మంజూరు చేయించినట్లు ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని అన్నారు. తాండూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు, తాండూర్ సమీపంలోని కాగ్నా వంతెన తదితర పనులు గతంలోనే మంచూరైనాయని మురళి కృష్ణ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డినీ తాను గతంలో అండగా ఉండి గెలిపిస్తే మాఫియాలకు, డ్రగ్స్ కు తాండూరు నిలయంగా చేశారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో తాండూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం. రాకేష్ మహారాజ్, నాయకులు నరేందర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.