బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపుకై ఇంటింటా ప్రచారం

బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపుకై ఇంటింటా ప్రచారం

ముద్ర.వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి అన్నారు.  వీపనగండ్ల మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తల తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఓటర్లను కలిసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు,పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో ఉంటేనే మన భవిష్యత్‌ బాగుంటుందని వారు సూచించారు.రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే కేసీఆర్‌ గెలవాలని,కేసీఆర్‌ గెలవాలంటే కారు గుర్తు మీద ఓటు వేయాలని ఓటర్లను కోరారు. రాష్ర్టంలో భారస ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, కేసీఆర్‌ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు, దసలవారీగా ఆసరా పింఛన్ల పెంపు, ఐదు లక్షల కేసీఆర్ బీమా, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలు, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం వంటి పథకాలను అందించడం జరుగుతుందని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు వివరించారు, కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు మౌలాన్ బి, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సాయి బాబా, వార్డు సభ్యులు నారాయణరెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి, ఏత్తం బాలస్వామి,రజాక్, ముంత శివ యాదవ్,నారాయణ, శేఖర్ రెడ్డి, శేఖర్ నరసింహ, మహిళా నాయకురాలు బొమ్మిరెడ్డి జయంతి, అలివేల తదితరులు ఉన్నారు.