ఓటరు నమోదు దరఖాస్తులను ఎప్పటి కప్పుడునమోదు చేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఓటరు నమోదుకు వచ్చే దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ఓటరు నమోదుకు జిల్లాలో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా కలెక్టర్ ఆదివారం దొంతికుంట తాండా, సోలిపూర్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అందులో ఫారం, 6 ఎన్ని ఫారం 7,8 ఎన్ని వచ్చాయని బి.ఎల్. ఒ ను వివరాలు అడిగారు. వచ్చిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలనీ ఆదేశించారు. అక్టోబర్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు దాటిన యువత సెప్టెంబర్, 19 వరకు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్ లైన్ ద్వారా కానీ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. ఘనపూర్ తహశీల్దార్ పాండు నాయక్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.