మళ్లీ గంగులనే గెలిపించుకుంటాం

మళ్లీ గంగులనే గెలిపించుకుంటాం
  • 28వ డివిజన్ ప్రజల తీర్మానం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తాని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గడిచిన 8 సంవత్సరాల్లో కరీంనగరాన్ని గొప్పగా అభివృద్ది చేసి చూపించామన్నారు. పలు ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అశోక్ నగర్  28వ డివిజన్ లో వాసవి లైన్-1, లైన్-2 లకు చెందిన స్థానికులతో సమావేశాన్ని నిర్వహించారు. వాసవి హైట్స్ లో నిర్వహించిన ఈ సమావేశానికి మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి  హాజరై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే డివిజన్ లో చాలావరకు సమస్యలను పరిష్కరించామని మిగిలిపోయిన చిన్న చిన్నసమస్యలను సైతం త్వరలోనే పరిష్కారిస్తామని హామి ఇచ్చారు. మరోసారి మంత్రి గంగుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సిఎం కెసిఆర్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గంగులకే మా ఓటు వేసి గెలిపించుకుంటామని తీర్మాణం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు నక్క కృష్ణ వంగల పవన్ కుమార్, మరియు వాసవి వీధి ఒకటవ డివిజన్ అధ్యక్షులు ఎన్. శ్రీనివాస్, రెండవ వీధి అధ్యక్షులు మల్లేశము రతన్, కృష్ణ, హరీష్, ప్రసాద్, నాగభూషణం, నాగరాజు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.