చిరు వ్యాపారుల‌కు  మంత్రి ఐకె రెడ్డిచే గొడుగుల పంపిణీ

చిరు వ్యాపారుల‌కు  మంత్రి ఐకె రెడ్డిచే గొడుగుల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ పట్టణంలో ప్రధాన కూడ‌ళ్ల‌లో చిరువ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఉచితంగా గొడుగులు పంపిణీ చేశారు. ఐ కె ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో  1000 గొడుగుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.నిర్మల్ పట్టణంలో 600 వీధి వ్యాపారులకు, మండలాలలో 400 వ్యాపారులకు పంపిణీ చేయనున్నారు. వర్షాల వల్ల రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకొంటున్న వారికి ఉపశమనం పొందేందుకు  గొడుగులు పంపిణీ  చేస్తున్నామని పేర్కొన్నారు. రోజంతా ఎండనక, వాననక  చిరు వ్యాపారాలు నిర్వ‌హించు కుంటున్న మ‌హిళ‌లు, వృద్దులకు  కొంత నీడనివ్వాల‌నే ఉద్దేశ్యంతో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌న్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.