తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన జయంత్

తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన జయంత్

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి తహసీల్దారుగా జినుక జయంత్ గురువారం తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.ఈయన కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ విధులు నిర్వహించారు. ప్రస్తుతం చిగురుమామిడి తహసిల్దార్ గా  విధులను నిర్వహించిన మోబిన్ అహ్మద్   కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో సూపరిండెంట్ గా బదిలీపై వెల్లారు. ఈయన తన పదవీకాలంలో  సమర్థవంతమైన రెవెన్యూ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.నూతన బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జినుక జయంత్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని  తెలిపారు. అనంతరం మండల రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ ను ఘనంగా సత్కరించారు.