జర్నలిస్టులకు జేఎస్ఆర్ అండ

జర్నలిస్టులకు జేఎస్ఆర్ అండ
  • జర్నలిస్టులందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా
  •  అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్

చిగురుమామిడి ముద్ర న్యూస్: జర్నలిస్టులకు అండగా ఉంటానని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి( జేఎస్ఆర్) హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని తన సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ చేపిస్తానని తెలిపారు. చిగురుమామిడి మండలంలో శనివారం రోజున జర్నలిస్టుల ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ  సందర్భంగా జేఎస్ఆర్ మాట్లాడుతూ... జర్నలిస్టుకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మిస్తామని, ఉచిత వైద్య, జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టు సమస్యలను ఎజెండాలో పొందుపరిచే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

బిజెపి ప్రభుత్వం అధికారంలో రావడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. యువత బిజెపి పార్టీకి అండగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి మర్చిపోయిందని, నియోజకవర్గంలో దళిత బంధు, అలాగే బీసీలకు బీసీ బంధు పథకాన్ని అర్హులైన వాందరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.   డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.