మహిళా రక్షణే పోలీసు లక్ష్యం

మహిళా రక్షణే పోలీసు లక్ష్యం

కేసముద్రం, ముద్ర: మహిళా రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందని షీ టీం సిఐ మోహన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ పాఠశాల/కళాశాలలో ప్రిన్సిపల్ విజయలలిత అధ్వర్యంలో గురువారం మహిళల యొక్క సాధికారత, తెలంగాణ ఉద్యమ పోరాటంలో మహిళ పాత్ర, మహిళల భద్రత, సంరక్షణ కొరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు షీ టీం భరోసా కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై వివరించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ప్రతినిధి అరుణ, బరోసా టీమ్ సభ్యులు జ్యోత్స, వైస్ ప్రిన్సిపల్ బి.ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.