మహిళపై వీధి కుక్కల దాడి

మహిళపై వీధి కుక్కల దాడి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో నార్లపురం వీరలక్ష్మి అనే మహిళపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాయి. తన ఇంటి ఆవరణలో అరుగు పై నిద్రిస్తున్న వీరలక్ష్మిపై ఆదివారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కరిచాయి. కుక్కల దాడిలో ముఖము, చేతులపై తీవ్ర గాయాలైన వీరలక్ష్మిని వెంటనే కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరలక్ష్మీ ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో గ్రామంలో సంచరిస్తున్న పలు వీధి కుక్కలను గ్రామస్తులు హతమార్చారు.