ట్రాక్టర్ కిందపడి చిన్నారి బాలుడు దుర్మరణం

ట్రాక్టర్ కిందపడి చిన్నారి బాలుడు దుర్మరణం

కేసముద్రం, ముద్ర: ట్రాక్టర్ కిందపడి ఏడాదిన్నర పసి బాలుడు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ వర్షం కారణంగా స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ ను కొందరు నెడుతుండగా అక్కడే ఉన్న ఎం. హేమంత్ కుమార్ అనే ఏడాదిన్నర బాలుడు టాక్టర్ చక్రం కిందపడి మృతి చెందాడు. తాత నరసయ్య హేమంత్ ను ఎత్తుకోగా ట్రాక్టర్ స్టార్ట్ కాకపోవడంతో, హేమంత్ ను కిందికి దించి తాత నరసయ్య తోపాటు తండ్రి ఐలయ్య ట్రాక్టర్ ను నెట్టగా ముందుకు వెళ్లిన ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో అక్కడే ఉన్న హేమంత్ ట్రాక్టర్ కింద పడి దుర్మరణం పాలు కావడంతో ‘నీ సావు కోసమే ట్రాక్టర్ నెట్టినమా బిడ్డా' అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.