మృతురాలి కుటుంబానికి పరిహారం చెక్కు పంపిణీ

మృతురాలి కుటుంబానికి పరిహారం చెక్కు పంపిణీ

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తౌరియా తండాకు చెందిన గుగులోతు భద్రమ్మ గత ఏడాది ఆగస్టు నెలలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. బట్టలను దండముపై ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్తో మృతి చెందగా, ఈ మేరకు విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో మహబూబాబాద్ డివిజన్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఇనుగుర్తి ఏ ఈ శశిధర్ పాల్గొన్నారు.