74 గణతంత్ర దినోత్సవ సందర్భంగా వ్యాసరచన పోటీలో గెలుపొందినవిద్యార్థులకు బహుమతులు అందజేసిన అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్.
![74 గణతంత్ర దినోత్సవ సందర్భంగా వ్యాసరచన పోటీలో గెలుపొందినవిద్యార్థులకు బహుమతులు అందజేసిన అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్.](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d27aa81484e.jpg)
గురువారం మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ ఘనంగా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది, ఈ సందర్భంగా అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశాలకు లేనిది భారతదేశంలో మాత్రం రెండుసార్లు జెండా ఎగరవేయడం జరుగుతుంది, స్వతంత్రం వచ్చినందుకు ఒకరోజు గాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినభారత రాజ్యాంగం రచన జరిగినందుకు ఫలితంగా రిపబ్లిక్ డే జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది, ప్రపంచ దేశాలను రాజ్యాంగాలను అధ్యయనం చేసి అన్ని రాజ్యాంగాలను వడపోసి భారత రాజ్యాంగాన్ని రాయడానికి శ్రీకారం చుట్టారని అందుకు ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈ వేడుకలు భారతదేశ పౌరులందరూ జరుపుకుంటున్నారని కాబట్టి వారి త్యాగపలికాలను మరువకూడదని ప్రజలకు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా గర్ల్స్ హై స్కూల్, నలంద డిగ్రీ కాలేజీ, స్వామి వివేకానంద కాలేజీ, ముత్యాలమ్మ గూడెం గర్ల్స్ హై స్కూల్, కస్తూరిబా గాంధీ స్కూల్ బయ్యారం, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ మోదులగూడెం, విద్యార్థులు వ్యాసరచన రాసిన లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ,తృతీయ, బహుమతులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ వనపర్తి శ్యాము, మహబూబాబాద్ జిల్లా రూలర్ ప్రెసిడెంట్ బానోత్ చిట్టిబాబు,తెలంగాణ ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం, జనరల్ సెక్రెటరీ ఆలేటి రమేష్, జిల్లా ప్రతినిధి శ్రీరామ్ ప్రసాద్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్,ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ కవిత,జాయింట్ సెక్రెటరీ పోలసాని విక్రమ్,కేసంద్ర మండల ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, ఇల్లందు నియోజక వర్గం జాయింట్ సెక్రటరీ సూర్య కుమార్, కురవి మండలం భూక్య సురేష్,కేసముద్రం మండల ఎడ్యుకేషనల్ సెల్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, ఖమ్మం జిల్లా కమిటీ మెంబర్ శ్రీ మను, జిల్లా ఆల్ ప్రోగ్రామ్ ప్రెసిడెంట్ జమాలుద్దీన్, అశోక్ కుమార్,దిలీప్, సందీప్, జిమెయిల్, మైబెల్లీ,కుమార్, ఆటో యూనియన్ సభ్యులు, వర్తక సంగం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.