మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు బీపామ్ అందించిన కేసీఆర్

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు బీపామ్ అందించిన కేసీఆర్

ముద్ర ప్రతినిధి,మహబూబాబాద్:- మహబూబాబాద్ పార్లమెంట్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి బరిలో దిగుతున్న ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గురువారం తెలంగాణ భవన్ లో బీఫామ్ అందజేశారు. బీపామ్ అందజేసిన కేసీఆర్ మహబూబాబాద్ పార్లమెంట్ నుండి ఖచ్చితంగా తిరిగి విజయం సాధిస్తావని కవితను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజురవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, డిఎస్ రెడ్యానాయక్, హరిప్రియ మహబూబాబాద్ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, మాజీఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.